సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడెప్పుడు మళ్ళీ సెట్ లో అడుగుపెడదామని చూస్తుంటే  బాలకృష్ణ, వెంకటేష్ మాత్రం ఇప్పుడే తొందరేం లేదు మరి కొంత కాలం వేచి చూద్దాం అంటున్నారు.  గత రెండు నెలల నుండి  కరోనా వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా వున్నా కూడా ఇటీవల టాలీవుడ్ పెద్దలు  షూటింగ్ లకు కోసం ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగడం తో  జూన్ నుండి కొద్దీ మంది తో షూటింగ్ జరుపుకోవడానికి ఓకే చెప్పింది అయితే ఇప్పటివరకు మాత్రం షూటింగ్ లు స్టార్ట్ కాలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్స్  పనులను  కానిస్తున్నారు.
 
ఇక జూన్ 15నుండి చిరంజీవి ,ఆచార్య షూటింగ్  ను మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. చిరు తోపాటు మరికొందరు హీరోలు కూడా సెట్ లోకి  అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు అయితే  బాలకృష్ణ ,వెంకటేష్ మాత్రం ఇప్పట్లో సెట్ లో అడుగుపెట్టలే లేరు. కరోనా కన్నా షూటింగ్ ముఖ్యమేమి కాదు ఇలాంటి సమయంలో షూటింగ్ చేయడం చాలా రిస్క్  అంటూ ఇటీవల బాలయ్య చెప్పుకొచ్చాడు అంతేకాదు ఆగస్టు వరకు బాలకృష్ణ షూటింగ్ కు రానని కూడా నిర్మాత తో చెప్పేశాడట. 
 
మరోవైపు వెంకటేష్ కూడా ఈలాంటి టైం లో రిస్క్ చెయ్యవద్దు  మినహాయింపులు ఇచ్చినంత మాత్రాన  కరోనా తగ్గినట్లు కాదని... మరో రెండు, మూడు నెలల వరకు షూటింగ్ లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడట. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోవెంకీ తిరిగి సెట్ లో అడుగుపెట్టేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ ,నారప్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కోలీవుడ్  బ్లాక్ బాస్టర్ మూవీ అసురన్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని కలై పులి ఎస్ థాను, సురేష్ బాబు నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: