తెలుగులో మహేష్ బాబు క్రేజ్ గురించి ఎవరికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమా వస్తుంది అంటే చాలు జనాలకు ముందు నుంచి కూడా ఒక పిచ్చి అనేది ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాల విషయంలో చాలా వరకు ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఏ సినిమా కూడా దూకుడుగా చేయవద్దు అని మహేష్ బాబు భావిస్తున్నాడు అనే ప్రచారం టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతుంది. మహేష్ బాబు ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతను రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. 

 

సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు అని సమాచారం. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే తాను తమిళ మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుస్తుంది. సర్కారు వారి పాటలో ఇప్పుడు ఎక్కువగా తమిళ నటులను తీసుకునే ఆలోచనలో ఆయన ఉన్నాడు అని సమాచారం. దర్శక నిర్మాతలకు ఇదే విషయాన్ని చెప్పాడట మహేష్ బాబు. దీనితో వాళ్ళు కూడా మహేష్ బాబు మాటను కాదు అనలేక ఓకే చేసారు అని తెలుస్తుంది. 

 

ఇప్పుడు అక్కడ ఉండే కొందరు అగ్ర నటుల కోసం నేరుగా మహేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఈ సినిమాలో కచ్చితంగా వాళ్ళతో ఒక అరగంట అయినా సన్నివేశాలు ఉండే విధంగా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు అని సమాచారం. ఇదే విషయాన్ని దర్శకుడి కి చెప్పగా అతను ఎవరు అయితే బాగుంటుంది అనే దాని మీద ఎక్కువగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. నిర్మాతతో ఈ చర్చలు పూర్తి అయితే దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉండి.

మరింత సమాచారం తెలుసుకోండి: