టాలీవుడ్ లో క్యారెక్టర్స్ ఆర్టిస్టులకు మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో ఈమధ్య ఆ పాత్రలకు మంచి పేరు తెచ్చుకున్నారు మళయాళ నటుడు జయరాం. అక్కడ హెర్గా చేస్తూనే తెలుగులో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వస్తున్నారు జయరాం. భాగమతి, అల వైకుంఠపురములో సినిమాలో నటించి మెప్పించిన జయరాం కు తెలుగులో సూపర్ ఛాన్సులు వస్తున్నాయి. లేటెస్ట్ గా రెండు భారీ సినిమాల్లో జయరాం నటిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి ప్రభాస్ 20 సినిమా కాగా.. ఎన్టీఆర్ 30వ సినిమాలో కూడా నటిస్తాడని తెలుస్తుంది. 

 

సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సినిమాలో జయరాం కు కీలక పాత్ర ఇచ్చినట్టు టాక్. ఇక త్రివిక్రమ్ డైరక్షన్ లో తెరకెక్కే ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆయనకు సూపర్ రోల్ పడ్డదట. సో మొత్తనానికి తెలుగులో వస్తున్న ఛాన్సులను జయరాం కూడా మంచి అవకాశాలుగా భావిస్తున్నాడు. చేస్తున్న సీన్మాలో వైవిధ్యతను చూపిస్తూ ఇంకా మరిన్ని ఛాన్సులు అందుకునేలా ఉన్నాడు. 1988లో అపరన్ మళయాళ సినిమాతో మల్లూవుడ్ లోకి అడుగుపెట్టాడు జయరాం. 

 

హీరోగా చేస్తూనే మిగతా హీరోల సినిమాల్లో ఎలాంటి రోల్ వచ్చినా సరే చేసుకుంటూ వెళ్తున్నారు జయరాం. ఎన్టీఆర్, ప్రభాస్ రెండు సినిమాలు చాల పెద్ద ప్ర్రాజెక్టులని తెలుస్తుంది. మరి ఈ సినిమాలకు సంబంధించి నెక్స్ట్ అప్డేట్ త్వరలో తెలుస్తుంది. కచ్చితంగా తెలుగులో జయరాం కు క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇంకాస్త క్రేజ్ తెచ్చేలా ఉన్నాయి. ప్రభాస్ సినిమాలో ఏమో కానీ ఎన్టీఆర్ సినిమాలో మాత్రం మళ్ళీ త్రివిక్రమ్ జయరాం కు మంచి రోల్ ఇచ్చాడని తెలుస్తుంది. జయరాం కూడా తెలుగులో వస్తున్నా ఆఫర్లకు చాల హ్యాపీగా ఫీల్ అవుతున్నారట.                   

 

మరింత సమాచారం తెలుసుకోండి: