అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ హీరోగా చేసిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి డిజాస్టర్ రూపంలో వెల్కమ్ లభించింది. ఆ సినిమా ప్రేక్షకులకి అంతగా రుచించలేదు. ఆ తర్వాత మనం చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ప్రేమ కథా చిత్రమైన హలో చిత్రాన్ని తీసాడు. అది కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

 

ఆల్రెడీ తెలుగు సినిమాల్లో ఎన్నోసార్లు వచ్చిన కంటెంట్ కావడంతో సింపుల్ గా పక్కన పెట్టేసారు. ముచ్చటగా మూడవ చిత్రం మిస్టర్ మజ్ను పేరుతో వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా ఫెయిలందనే చెప్పాలి. దాంతో నాగార్జున అఖిల్ నాలుగవ సినిమా బాధ్యతలని అల్లు అరవింద్ కి అప్పగించాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ పేరుతో సినిమా తెరకెక్కుతోంది.

 

పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ 80శాతానికి పైగా పూర్తయింది. కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయి వేసవిలో రిలీజ్ కావాల్సిన చిత్రం వాయిదా పడింది. ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, అఖిల్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బ్యాలన్స్ ఉన్నాయట. అయితే ఇప్పటి వరకూ జరిగిన చిత్రీకరణని ఎడిట్ చేసి నాగార్జున చూసారట. అఖిల్ కి ఈ సారి ఎలాగైనా హిట్ ఇవ్వాలనే తపనతో డైరెక్టర్ కి కొన్ని సలహాలు ఇచ్చాడట.

 


ఇప్పటి వరకు వచ్చిన పోర్షన్ పట్ల నాగార్జున సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. ప్రేమ కథల్ని అందంగా చెప్పే భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ చాలా చక్కగా వచ్చిందని అంటున్నారు. మరి నాగ్ చెప్పిన సజెషన్స్ తో మరింత బాగా తీర్చిదిద్దుతున్నాడట. మొత్తానికి అఖిల్ ఈ సారి హిట్ కొట్టేలానే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: