నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కినట్టు కనిపించిన డైరక్టర్ తేజ మళ్ళీ సీత సినిమాతో నిరాశపరిచాడు. ఆ సినిమా హిట్టయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ కొద్దిపాటి గ్యాప్ తో ఒకేసారి రెండు భారీ సినిమాలను ఎనౌన్స్ చేశాడు తేజ. అందులో ఒకటి రానా హీరోగా చేస్తున్న సినిమా కాగా మరోటి గోపీచంద్ హీరోగా చేస్తున్న సినిమా ఉంటుందని తెలుస్తుంది. రానా సినిమాకు కొద్దిగా టైం పడుతుందని అంటున్నారు. అందుకే గోపీచంద్ తో తీసే సినిమాను ముందు సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు తేజ. 

 

అలివేలు వెంకటరమణ టైటిల్ తో గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు తేజ. గోపీచంద్ లాంటి మాస్ హీరోకి ఆ టైటిల్ కు ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగా ఉంది కదా.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. అందుకే ఆ పాత్రకు సూట్ అయ్యేలా మంచి హీరోయిన్ ను తీసుకోవాలని చూస్తున్నాడు తేజ. లిస్ట్ లో అనుష్క, రకుల్, సాయి పల్లవి లాంటి పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. గోపీచంద్, అనుష్క ఇద్దరు 12 ఏళ్ల క్రితం కలిసి చేశారు. 

 

అప్పట్లో ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. అందుకే గోపీచంద్ అనుష్క కలిసి చేయలేదు. ఇక ఇప్పుడు కూడా అనుష్క ఆ సినిమాలో హీరోయిన్ అయ్యే ఛాన్సులు తక్కువ అని తెలుస్తుంది. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే యువ హీరోలతో నటిస్తున్న ఈ అమ్మడు గోపీచంద్ లాంటి మిడిల్ ఏజ్డ్ దానితో పాటుగా సక్సెస్ లో లేని హీరోతో చేస్తుందా అన్న డౌట్ కలుగుతుంది. అందుకే తేజ మూడవ ఆప్షన్ గా రకుల్ ను పెట్టుకున్నాడు. తెలుగులో అవకాశాలు లేక ముంబై చెక్కేసిన ఈ అమ్మడు మళ్ళీ తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటుంది. తేజ సినిమా హిట్టు పడితే రకుల్ టాలీవుడ్ లో తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: