బాలీవుడ్ భామా కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమాలో ప్రిన్స్ మహేశ్బాబు పక్కన నటించి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’లో రామ్చరణ్ సరసన కనిపించి మంచి విజయాన్నే తన ఖాతాలో వేసుకుంది. కియరా అద్వానీ వినయ విధేయ రామ చిత్రం తర్వాత ఏ తెలుగు చిత్రంలో కనిపించలేదు. అయితే తాజాగా ఓ తెలుగు చిత్రంకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మహేశ్బాబుకి జోడీగా ‘సర్కారువారి పాట’లోనూ ప్రిన్స్ సరసన నటించబోతోందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు హీరోయిన్ గురించి ఎటువంటి సమాచారం మేకర్స్ ఇవ్వకపోవచ్చు. ఒక్కసారి కియారా డేట్స్ అడ్జస్ట్ చేయగానే అఫీషియల్గా ఆమె పేరును చిత్రయూనిట్ ప్రకటించనుందని అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని మహేశ్ ఫస్ట్ లుక్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న విడుదలైంది. మరి.. మహేశ్.. కియారా జంట మళ్లీ తెర మీద కనబడుతుందని ప్రచారం రావటంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. `సర్కారు వారి పాట`. టైటిల్తోనే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్.. సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ ఓ బ్యాంక్ మేనేజర్ కొడుకుగా కనిపించబోతున్నాడని, బ్యాంకుకు టోపీ పెట్టిన బడా బాబు నుంచి తిరిగి డబ్బులు కట్టించే వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరిగింది.
ఇదిలా ఉండగా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన మరో కథ కూడా ప్రచారంలో ఉండటం విశేషం. ఆ కథ ఇలా ఉంటుందంట. చిత్రంలో మహేష్ ఫైనాన్సియర్గా కనిపిస్తాడు. అవసరమైన వాళ్లకి అప్పులిచ్చి, తిరిగి కచ్చితంగా వసూలు చేసుకునే వ్యక్తి పాత్రలో కనిపిస్తాడట. వాస్తవానికి ఈ సినిమాను అమెరికాలో తెరకెక్కించాలని ముందు ప్రణాళిక వేసుకున్నా కరోనా కారణంగా అక్కడ షూటింగ్ వీలు కాకాపోవడంతో గోవాను ఎంచుకున్నారట. మహేష్ ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం.