ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సినిమాలకు క్రేజ్ అనేది తగ్గుతుంది. ఆయన సినిమాలను చూసే వారు కూడా పెద్దగా లేరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య పాత్ర విషయంలో అనేక చర్చలు టాలీవుడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. బాలకృష్ణ ఇప్పుడు రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టుకున్నారు. ఆ సినిమాలను అన్నీ కూడా ఇక నుంచి తానే నిర్మించుకోవాలి అని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. 

 

తన సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరించాలి అని ఆయన భావించడం వెనుక కారణం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆయనకు ఇటీవల ఇద్దరు నిర్మాతలతో సమస్యలు వచ్చాయని అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆయన సినిమాలకు నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలో కూడా ఆయన పెట్టుబడే ఎక్కువగా ఉందని సమాచారం. దీని వెనుక వాస్తవం ఎంత ఉంది అనేది పక్కన పెడితే... 

 

ఆయన సినిమాలకు ఈ మధ్య కాలంలో నష్టాలు అయితే వస్తున్నాయి అనే మాట  నిజం. అందుకే బాలయ్య ఇప్పుడు సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని ఎవరి మీద కూడా ఆయన ఆధార పడవద్దు అని భావించిన టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఆయన ఏయే సినిమాలకు భవిష్యత్తులో నిర్మాతగా వ్యవహరిస్తారు అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య చేతిలో ఒక సినిమానే ఉంది. మిగిలిన సినిమాలకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: