స్వీటీ బ్యూటీ అనుష్క నిర్మాతలకు చుక్కలు చూపించేస్తుందా ? అసలు ఓ వైపు ఆమెకు సినిమా ఛాన్సులు రాకపోవడం ఓ దెబ్బ అయితే ఇప్పుడు ఆమెకు ఛాన్సులు ఇచ్చిన ఒకరిద్దరు నిర్మాతలు కూడా ఆమె దెబ్బకు దండం పెట్టేస్తున్నారా ? అంటే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో అవును అన్న గుసగుసలే వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే అనుష్క - మాధవన్ - షాలిని పాండే కలయికలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నిశ్శబ్దం మూవీ షూటింగ్ పూర్తయ్యి చాలా కలం గడిచింది.
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పలు సార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. మరి కొన్ని రోజులు ఓటీటీ లో నిశ్శబ్దం రిలీజ్ అవుతుందని అన్నారు. ఇప్పుడు ఈ సినిమా వార్తలు సైలెంట్ అయ్యాయి. అయితే ఈ సినిమా విషయంలో అనుష్క ఏ మాత్రం ఇంట్రస్ట్ గా లేదట. ఆమె నిర్మాతలను ఇబ్బందులు పెడుతోందని.. అనుష్క వల్ల నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇండస్ట్రీ టాక్..?
కరోనా వల్ల సినిమా లేట్ అవ్వడంతో నిర్మాతలు తెచ్చిన అప్పుకు నెలకు రు. 50 లక్షలు వడ్డీ కడుతున్నారు. ఈ వడ్డీల బాధలు భరించలేక నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారట. అయితే అనుష్క మాత్రం ఇది పెద్ద సినిమా.. నా రేంజ్ ఏంటి ? ఓ స్టార్ హీరోయిన్ గా ఉన్న నా సినిమాను ఓ టీటీలో రిలీజ్ చేస్తారా ? అని నిర్మాతలను ఇబ్బంది పెడుతోందట.
నిశ్శబ్దం సినిమా థియేటర్స్ లోనే విడుదల కావాలి కానీ.. ఇలాంటి వాటిలో కుదరదని ఖరాఖండిగా చెప్పడంతో.. నిర్మాతలు అనుష్క ని ప్రాధేయపడుతున్నారట. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది.