మలయాళ భామ కీర్తి సురేష్ తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మహానటి సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకుంది. తెలుగులో మాత్రమే కాదు తమిళ భాషలో కీర్తి క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ స్టార్ సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ కమర్షియల్ సినిమాలకు ఫస్ట్ ఆప్షన్ అయ్యింది. టాలీవుడ్ లో కూడా కీర్తి సురేష్ వరుస సినిమాలు చేస్తుంది. నేటి యువత మనసు గెలుచుకున్న కీర్తి సురేష్ గ్లామర్ షో విషయంలో మాత్రం అప్పుడు ఇప్పుడు ఓకే మాట మీద ఉంది. 

 

హీరోయిన్ అన్నాక ముందు అభినయంతో మెప్పించినా అడపాదడపా గ్లామర్ షో చేయాల్సిందే. అయితే కీర్తి సురేష్ మాత్రం అందుకు వ్యతిరేకం. ఆమె స్కిన్ షో చేయకుండానే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇప్పటికి కూడా కీర్తి సురేష్  కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా లిప్ లాక్స్, హాట్ షోలకు మాత్రం నో అని చెబుతుంది. 2016 టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ నాలుగేళ్లలో స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియాతో పాటుగా నితిన్ తో రంగ్ దే, పవర్ పేట సినిమాల్లో నటిస్తుంది. 

 

స్టార్ స్టేటస్ ఉన్నా సరే.. చేసేవి కమర్షియల్ సినిమాలు అయినా సరే కీర్తి సురేష్ గ్లామర్ షో విషయంలో మాత్రం ఎప్పుడు ఒకే మాట మీద ఉంది. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కు స్కిన్ షో చేయడం మొదలుపెడితే మాత్రం ఇక ఆమెకు తిరుగు ఉండదని చెప్పొచ్చు. మలయాళంలో కూడా కీర్తి పాపులారిటీ బాగా ఉంది. అందుకే ఆమెతో ఫీమేల్ సెంట్రిక్ మూవీ తీసి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. తమిళంలో పెంగ్విన్ సినిమా ఓటిటిలో రిలీజ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: