నయనతార ప్రభుదేవా ఓ  సినిమాలో  కలిసి నటిస్తారని గత కొన్ని రోజులుగా కోలీవుడ్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాపై నిర్మాత క్లారిటీ ఇస్తూ వారిద్దరూ కలిసి నటించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా ఇప్పటిది కాదు... దాదాపుగా కొన్నేళ్ళ కిందట ఈ సినిమా మొదలైంది. అయితే అప్పట్లో నయనతార ప్రభుదేవాతో ప్రేమలో కొనసాగిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం కోలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇంకొన్ని రోజుల్లో నయనతార ప్రభుదేవా ఇద్దరు  పెళ్లి చేసుకుని ఒక్కటవుతారు అని అనుకుంటున్న తరుణంలో వీరిద్దరి మధ్య బ్రేకప్  జరిగిపోయింది. 

 అయితే ఆ సమయంలోనే ప్రభుదేవా దర్శకత్వంలో ఈశ్వరి నిర్మాతగా కరుప్పు  రాజా వేలై రాజా అనే చిత్రం మొదలైంది. ఈ సినిమాలో విశాల్ కార్తి ప్రధాన పాత్రలో  కొంత షూటింగ్ కూడా జరుపుకొంది. ఇక ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల రెండేళ్ల కిందటే నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది అని వార్తలు ప్రస్తుతం కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ప్రభుదేవా నయనతార కలిసి నటించబోతున్నారని ప్రచారం ఊపందుకుంది.ఇక తాజాగా నయనతార ప్రభుదేవా కలిసి నటించబోతున్నారు అని వస్తున్న వార్తలపై నిర్మాత ఈశ్వరి స్పందించారు. 

 


 కరుప్పు రాజా వేలై  రాజా చిత్రంలో నయనతార ప్రభుదేవాతో కలిసి నటించనున్నారు అని వస్తున్న వార్తల్లో  నిజం లేదని అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పారు. అయితే కార్తీ విశాల్ ప్రధాన పాత్రల్లో నిర్మించాలనుకున్న ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితమే వాయిదా పడిందని .. ఇప్పుడు ఈ సినిమాను పూర్తి చేయాలని ఉద్దేశం తనకు లేదని అంటూ నిర్మాత ఈశ్వరి క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి ప్రభుదేవా నయనతార కలిసి నటిస్తున్నారు అని వార్తలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే గతంలో లవ్ బ్రేకప్ అయిన  ఈ జంట మళ్లీ కలిసి నటిస్తారని అనేసరికి  ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. కానీ తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: