పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈచిత్రం 18వ శతాబ్దపు కాలం లో జరిగిన కథ తో తెరకెక్కుతుందట. పీరియాడికల్ మూవీ కావడంతో వేలమంది జూనియర్ ఆర్టిస్టులు అలాగే వందల సంఖ్యలో గుర్రాలు ,భారీ సెట్ లు అవసరం కానున్నాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత భారీ గా సినిమా తెరకెక్కించడం చాలా కష్టం. ప్రభుత్వం కూడా అతి కొద్దీ మంది తో షూటింగ్ జరుపుకోవాలని సూచించింది మరి ఇలాంటి నిబంధనల మధ్య క్రిష్ ఈసినిమా ను ఎలా డీల్ చేస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా ఇప్పట్లో ఈసినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. ఈచిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ను పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మలయాళ నటుడు జయరాం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య బ్యానర్ పై సుమారు 100కోట్ల బడ్జెట్ తో ఏం ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.