అతి చిన్న వయస్సులోనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన సుజీత్ రెడ్డి తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత రన్ రాజా రన్ సినిమా ను డైరెక్ట్ చేసి హిట్ కొట్టిన సుజీత్ ఆ వెంటనే ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకుని మధ్యలో ప్రభాస్ తో సాహో సినిమా మాత్రమే చేశాడు. ప్రభాస్ బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ సినిమాలో నటించాడు. మధ్యలో సుజీత్ ఏకంగా ఆరేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఒక్క సాహో మాత్రమే. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి ప్లాప్ అయ్యింది.
ఈ సినిమా ఫ్లాప్ తర్వాత చాన్నాళ్లు ఇంటికే పరిమితమైపోయిన ఈ డైరక్టర్, తన నెక్ట్స్ సినిమాకు ఏకంగా చిరంజీవిని డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. చిరంజీవితో లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరు కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా థియేటర్లలోకి రావాలి.. ఆ తర్వాత చిరు కాస్త గ్యాప్ తీసుకోవాలి.. అప్పుడే సుజీత్ - చిరు సినిమా ప్రారంభమవుతుంది.
ఇక ఈ గ్యాప్లో ఖాళీగా ఉండడం ఎందుకని సుజీత్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. సుజీత్కు ఇప్పటికే ఇంట్లో ఓ సంబంధం చూసి పెట్టారు. అమ్మాయి హైదరాబాద్ లో డెంటిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెతోనే సుజీత్ వివాహం త్వరలోనే జరగనుంది. ఇక సాహో ప్లాప్ అయినా కూడా సుజీత్కు ప్రభాస్ తో పాటు యూవీ క్రియేషన్స్ వాళ్లు పూర్తి అండగా ఉంటున్నారు. మొత్తానికి డాక్టరమ్మను సుజీత్ పెళ్లాడనున్నాడు.