విజయవాడలో గ్యాంగ్ వార్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించింది అనే విషయం అందరికి తెలిసిందే. ఈ గ్యాంగ్ వార్ దెబ్బకు ఒక్కసారిగా విజయవాడ షేక్ అయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నగరం లో అలజడి రేగింది. అసలే కరోనా తో బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్న జనాలు ఒక్కసారిగా భయపడ్డారు అనే చెప్పవచ్చు. ఇక ఇది పక్కన పెడితే ఈ గ్యాంగ్ వార్ లో ఇప్పుడు పోలీసులు దూకుడు పెంచారు. ఎవరు ఎవరు ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు అధికారులు. ఇక డీజీపీ గౌతం సవాంగ్ కూడా దీనిపై ఆగ్రహంగా ఉన్నారు. 

 

దాడిలో ఉన్న 25 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చెయ్యాలి అని ఆయన అధికారులకు సూచనలు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ గ్యాంగ్ వార్ పై ప్రముఖ దర్శకుడు సంచలనాల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి పెట్టినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చాలా రోజుల తర్వాత విజయవాడలో గ్యాంగ్ వార్ జరిగింది. దీనితో ఈ గ్యాంగ్ వార్ కి సంబంధించి ఒక చిన్న సినిమాను తీయడానికి ఆయన త్వరలోనే విజయవాడ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆయన త్వరలోనే దాడిలో మరణించిన తోటా సందీప్ భార్యను కలిసే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఆమెను కలిసిన తర్వాత దీనికి సంబంధించిన కథను సిద్దం చేసుకుని సినిమా చెయ్యాలి అని ఆయన భావిస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజం ఎంత అనేది మాత్రం తెలియదు గాని ఆయన ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించారు అని అంటున్నారు. దీనిపై త్వరలోనే విజయవాడ వచ్చి అప్పుడు ఆయన నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: