వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ సినిమాలు మొదలుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా క్రిష్ డైరక్షన్ లో చేస్తాడని తెలిసిందే. ఆ సినిమాకు ముహూర్త కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మాములుగా అయితే ఈపాటికి వకీల్ సాబ్ రిలీజ్ అయ్యి క్రిష్ సినిమా సెట్స్  ఉండాల్సింది కానీ కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్స్ అన్ని ఆపేశారు. ఈ క్రమంలో క్రిష్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియట్లేదు. ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ క్రిష్ ప్రాజెక్ట్ ను వెనక్కి నెట్టి హరీష్ శంకర్ సినిమా ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నారట. 

 

గబ్బర్ సింగ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే హిట్ అందించిన హరీష్ శంకర్ ఈసారి కూడా ఆ సినిమాను మించే సినిమా చేస్తానని అంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా క్రిష్ సినిమా తర్వాత చేయాల్సి ఉండగా ఇప్పుడు క్రిష్ సినిమాను ఆపి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్రయత్నిస్తున్నారట. క్రిష్ సినిమా పిరియాడికల్ మూవీగా రాబోతుంది. భారీ బడ్జెట్ తో చేయాల్సిన ఆ సినిమాను లిమిటెడ్ యూనిట్ సభ్యులతో చేయడం కుదరదు. అందుకే ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు చేయడం కుదరదని క్రిష్ సినిమాను ఆపి హరీష్ శంకర్ సినిమాను చేయాలని అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. 

 

క్రిష్, పవన్ కాంబో సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిరాశ కలిగించే వార్తా అయినా కూడా కరోనా ప్రభావం తగ్గినా తర్వాతనే ఆ సినిమా షూటింగ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా వకీల్ సాబ్ రిలీజ్ అవడమే కాకుండా హరీష్ శంకర్ సినిమా కూడా త్వరగానే పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: