యంగ్ టైగర్ ఎన్టీఆర్, కెజిఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. ఈరోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ విశ్ చేయడంతో పాటుగా ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న సినిమా రేడియేషన్ అంటూ టైటిల్ కూడా రివీల్ చేశారని అంటున్నారు. అవును ఎన్టీఆర్ తో రేడియేషన్ సినిమా అది కూడా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో అబ్బో ఇంకేముంది అన్ని సినిమాల రికార్డులు పక్కకు తప్పుకోవాల్సిందే. 

 

ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమా 2021 ఫస్ట్ హాఫ్ లో మొదలుపెడతారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ఎన్టీఆర్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం కెజిఎఫ్ 2 సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్సినిమా హిట్టు కొడితే మాత్రం అతని వెంట హీరోలు పడక తప్పదు. 

 

అందుకే ఎన్టీఆర్ ముందుగానే ప్రశాంత్ నీల్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ రేర్ కాంబో సినిమా అంటే ఆడియెన్స్ లో కూడా అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ కూడా నేషనల్ స్టార్ అవుతాడు కాబట్టి ప్రశాంత్ నీల్ సినిమాకు ఇంకాస్త క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: