బ్యాక్ ఎండ్ లో మ్యాజిక్ చేసే మేకర్స్ ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. అవుట్ పుట్ రాబట్టుకోవడమే కాదు.. అవుట్ పుట్ ఇవ్వడం కూడా తెలుసని ప్రూవ్ చేసుకున్నారు. అవార్డులు అందుకొని మరీ ఆర్టిస్టులుగా మారుతున్నారు దర్శకులు. ఇన్నాళ్లు ఆర్టిస్టులను భయపెట్టిన డైరెక్టర్స్, ఇప్పుడు ఆర్టిస్టులుగా జనాలను భయపెడుతున్నారు. 

 

స్టైలిష్ యాక్షన్ స్టోరీస్ తో అదరగొడతాడని గౌతమ్ మీనన్ కు సూపర్ ఇమేజ్ ఉంది. రొమాంటిక్ మూవీస్ లో గౌతమ్ స్పెషలిస్ట్ అని సౌత్ ఇండస్ట్రీ అంతా చెబుతుంది. అయితే ఇప్పుడు ఈ ఇమేజ్ తో పాటు సూపర్ పెర్ఫామర్ అనే ట్యాగ్ లైన్ కూడా చేరుతోంది. మళయాళం మూవీ ట్రాన్స్ లో గౌతమ్ పెర్ఫామెన్స్ చూసి సినీజనాలు ఆశ్చర్యపోతున్నారు. నటుడిగా వరుస అవకాశాలు ఇస్తున్నారు. 

 

ఖుషీ సిినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు ఎస్.జె.సూర్య. డైరెక్టర్ గా బోల్డన్ని బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు మెగాఫోన్ ను పక్కనపెట్టేశాడు. కథలు రాయడం, తెరకెక్కించడం అనే ప్రాసెస్ ను పక్కనపెట్టి, కెమెరా ముందు బిజీ అయిపోయాడు. యాక్టర్ గా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. మహేశ్ బాబు స్పైడర్, విజయ్ మెర్శల్ సినిమాల్లో విలన్ గా నటించాడు. ఇక ఈ పెర్ఫామెన్స్ తో కోలీవుడ్ లో నెగిటివ్ క్యారెక్టర్స్ కు ఫస్ట్ ఆప్షన్ గా మారాడు ఎస్.జె.సూర్య. 

 

రియలిస్టిక్ స్టోరీస్ తో తమిళనాట మంచి ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు సముద్రఖని. ఆఫ్ ది కెమెరా కనిపించే ఈ దర్శకుడు, ఇప్పుడు కెమెరా ముందు కూడా అదరగొడుతున్నాడు. విశారణై సినిమాతో బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్న సముద్రఖని తెలుగులోనూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ దర్శక నటుడు అల వైకుంఠపురములో విలన్ గా నటించాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ చేస్తున్నాడు సముద్రఖని. 

మరింత సమాచారం తెలుసుకోండి: