పిజ్జా సినిమాతో వినూత్నమైన సబ్జెక్టుని ఎంచుకుని ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన కార్తిక్ సుబ్బరాజ్ అందరికీ సుపరిచితమే. విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం అందుకుంది. దీంతో దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు పేరు మారుమోగిపోయింది. పిజ్జా తర్వాత జిగర్తాండ, రజనీ కాంత్ తో పేట వంటి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం ధనుష్ హీరోగా జగమే తంత్రం అనే సినిమాని ప్లాన్ చేసాడు.

 

 

సినిమా పూర్తయ్యాక కార్తీక్ సుబ్బరాజ్ మల్టీస్టారర్ ని తీసే ఆలోచనలో ఉన్నాడు. చియాన్ విక్రమ్ హీరోగా ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. గత కొన్ని రోజులుగా విక్రమ్ కి సరైన హిట్ లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా విజయం అందుకోవట్లేదు. విలక్షణ పాత్రలని ఇష్టపడే విక్రమ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పలురకాల గెటప్పుల్లో విక్రమ్ దర్శనమివ్వనున్నాడు. అయితే ఈ సినిమా అనంతరం విక్రమ్, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.

 

 

విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాడట. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమాలో తండ్రీ కొడుకులు మొదటిసారిగా తెరని పంచుకోనున్నారు. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ ఆదిత్య వర్మ ద్వారా తమిళ తెరకి పరిచయమైన ధృవ్, ఈ సారి తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ విషయమై కొలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

 

 

ఈ వార్త నిజమైతే విక్రమ్ అభిమానులకి పండగే అని చెప్పాలి. కార్తిక్ సుబ్బరాజు లాంటి విలక్షణ దర్శకుడితో సినిమా అంటే ఏదో కొత్తగా ఉండబోతుందని అందరికీ తెలిసిందే. మరి కార్తిక్ సుబ్బరాజ్ తండ్రీ కొడుకులని ఏ విధంగా చూపించనున్నాడో..! 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: