టాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ లకు మంచి డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. మహానటి సినిమా వచ్చి రెండేళ్ళు అయింది. అక్కడి నుంచి కూడా ఏ బయోపిక్ లను ఇంకా సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళలేదు. క‌రోనా నేప‌థ్యంలో సినిమా షూటింగ్‌లు.. రిలీజ్ లు వాయిదాలు ప‌డ్డాయి. ఇప్పుడు కోట్లు పెట్టుబ‌డులు పెట్టి కూర్చున్న నిర్మాత‌లు బాధ‌ప‌డుతున్నారు. సినిమాలను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళాలి అని నిర్మాతలు.. దర్శకులు భావిస్తున్నా సరే కొందరు మాత్రం ముందుకు రావడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా ఇప్పుడు టాలీవుడ్ లో వినపడుతున్నాయి. 

 

ఇటీవల టాలీవుడ్ లో కరణం మల్లీశ్వరి బయోపిక్ కి సంబంధించి ప్రకటన వచ్చింది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాను తీసుకుని రావాలి అని నిర్మాతలు భావిస్తున్నారు. అంత వరకు అలా ఉంటే ఈ సినిమాలో కరణం పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది తెలియడం లేదు. ఈ బయోపిక్ ని తీసుకుని రావడానికి తీవ్రంగా కష్టపడుతున్నా సరే నటి దొరకడం లేదు.  ఈ బయోపిక్ లో ఒక సీనియర్ హీరోయిన్ ఓకే చెప్పినట్టే చెప్పి తప్పుకుంది. 

 

ఇప్పుడు ఆమె కాదని మరొకరు అని అంటున్నారు. ఈ సినిమాలో నటించడానికి కాస్త రఫ్ గా కనపడాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో నటించడానికి గానూ యాంకర్ అనసూయ ని ఎంపిక చేసారు అని సమాచారం. ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంగస్థలం సినిమాలో ఆమె కాస్త రఫ్ గానే కనపడిన సంగతి తెలిసిందే. అందుకే ఆమెను అడిగారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: