తెలుగు సినిమాల్లో హిందీ నటులను తీసుకుని పాన్ ఇండియా సినిమాలను చెయ్యాలి అనేది మన వారి భావన. కరోనా ముందు వరకు కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ ఎక్కువగా ప్రయత్నాలు చేసిన మన స్టార్ హీరోలు కథ ఏ విధంగా ఉన్నా సరే కమర్షియల్ హంగుల కోసం నానా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అవి ఫలించినా లేకపోయినా సరే చెయ్యాల్సింది మాత్రం తమ నుంచి చేసారు. పాన్ ఇండియా సినిమాలు అంటూ సాహో, సైరాకు ఎన్నో హంగులు అద్దారు. తీరా ఆ రెండు సినిమాల రిజ‌ల్ట్ ఎలా వ‌చ్చిందో చూశాం.

 

అయితే ఇప్పుడు కరోనా వారి అంచనాలను పూర్తిగా మార్చింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహేష్ బాబుకి నిర్మాతలు ఊహించని షాక్ ఇచ్చారు అని టాక్. అవును సర్కారు వారి పాట సినిమాలో బాలీవుడ్ నటులను తీసుకోవాలి అని మహేష్ బాబు భావించాడు. ఈ మేరకు నిర్మాతలతో కూడా అతను చర్చలు జరిపాడు కూడా. అయితే ఖర్చు పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

హీరోయిన్ గా దీపిక ని లేదా దిశా పటాని ని తీసుకోవాలి అని చూసారు. కాని ఆ ఇద్దరూ కూడా ఎక్కువ డిమాండ్ చేసారు. అలాగే విలన్ గా కూడా బాలీవుడ్ కి చెందిన వారినే తీసుకోవాలి అని భావించారు. కాని అది కూడా సాధ్యం అయ్యే అవకాశాలు మాత్రం కనపడటం లేదు. మహేష్ బాబు నుంచి ఆసక్తి ఉన్నా సరే ఇప్పుడు సినిమాలకు జనాలు వచ్చే అవకాశం లేదని ఖర్చు వద్దని తక్కువలో పూర్తి చేసే ప్రయత్నం చేద్దామని చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: