భారతీయ చలన చిత్ర రంగంలో తన స్టైల్ తో కోట్ల మంది అభిమానులను ఆకట్టుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది. ఆయన వయసు అరవై దాటినా.. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నటిస్తున్నారంటే రజినీ స్టామినా ఏంటో తెలుసుకోవొచ్చు. రజినీకాంత్ ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న మ్యాటర్ వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది. ఆ మద్య అమెరికాలో శస్త్రచికిత్స కోసం వెళ్లిన సమయంలో ఎన్నో రూమర్లు వెలుగు లోకి వచ్చాయి.
ఆయన సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉండాలని కోట్ల మంది అభిమానులు దైవ ప్రార్థన చేశారు. అలాంటిది ఓ బాలీవుడ్ నటుడు చేసిన పనికి మరోసారి రజినీకాంత్ కి సంబంధించిన మ్యాటర్ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా కల్లోలం సమయంలో తమ అభిమాన హీరో సురక్షితంగా ఉన్నారని భావిస్తున్న ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు బాలీవుడ్ యాక్టర్ రోహిత్ రాయ్. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్కి పరీక్షలలో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా క్వారంటైన్లో ఉందని కామెంట్ పెట్టాడు.
అంతే ఈ విషయం విన్న రజినీ అభిమానులు మొదట కంగారు పడ్డారు.. కానీ తర్వాత అసలు విషయం తెలుసుకొని ఊపిరి పిల్చుకున్నారు.. ఆ తర్వాత ఆ బాలీవుడ్ నటుడిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. నువ్వు వేసిన జోక్ చాలా చెత్తగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరొకరు తమిళనాడులో రజనీకాంత్ని ఎంతగానో ఆరాధిస్తారు. ఇలాంటి జోకులతో వారి మనోభావాలు దెబ్బతీయకండి అని కామెంట్ చేశారు.