దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తరుణంలో సినిమా షూటింగ్ లు అన్నీ కూడా మూత పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనితో సినీ పరిశ్రమ నటులు అందరూ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ తరుణంలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది సినీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంతో కొన్ని అధికారిక చర్చలు కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వంతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని షరతులతో సినిమా సీరియల్ షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అనుమతి ఇవ్వడం జరిగింది. అంతేకానీ థియేటర్లలో మాత్రం సినిమాలను రిలీజ్ చేసేందుకు ఒప్పుకోలేదు.


ఇప్పటిలో థియేటర్లో తెరుచుకునే అవకాశం కూడా కనపడని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ సినిమా థియేటర్ లో తెరుచుకున్న సరే కానీ ప్రజలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే పరిస్థితి ఉంటుందో లేదో అని అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవ్వకపోతే నిర్మాతలు చాలా నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నష్టాల నుంచి ఎలా బయటపడాలో అని అర్థం కాక ఫిలిం మేకర్స్ అనేక ఆలోచనలతో ఉన్నారు. ఈ సమయంలో OTT ప్లాట్ఫామ్ కు కాస్త ఊపు అందుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వడంతో ఓటీటీ సంస్థలకు భారీగా సబ్స్క్రైబర్లు సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతుంది. ఈ తరుణం లో సినిమాలను ott ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు. 


ఇందులో భాగంగానే తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా సినిమాల్లో పోటీ ప్లాట్ఫామ్ లో సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా గతంలో నాని నటించిన v, రామ్ నటించిన రెడ్ సినిమాలు కూడా పోటీలో విడుదల చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రసారాలు కూడా వినిపించాయి. ఇక అప్పుడే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా ఈ OTT లో విడుదల పర్వాలేదు అని అనిపించుకోవడం జరిగింది. ఇక ఈ తరుణంలోనే కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ కూడా 19 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే కీర్తి సురేష్ నటించిన ఇంకో సినిమా మిస్ ఇండియా కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.


ఇక బాహుబలి వంటి సినిమాలను నిర్మించిన శోభు యార్లగడ్డ ఇటీవల నిర్మించిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ఈ సినిమాను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు కనిపించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ ఒక ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డీల్ ఓకే అయితే అతి త్వరలోనే ఈ సినిమా కూడా ott ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవబోతుంది. దీనితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లక్ష్మి సినిమా కూడా పోటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: