దేశంలో ఫిబ్రవరి నెల నుంచి మొదలైన కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటి వరకు వదలలేదు.. వదులుతుదంతో లేదో తెలియదు.  సామాన్యు ల నుంచి సెలబ్రెటీల వరక ఎవ్వరినీ కరోనా వదలడం లేదు. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కి కరోనా పాజిటీవ్ రాగా వారంతా క్వారంటైన్ లో ఉంటూ వచ్చారు.  కొంత మంది కరోనాతో మరణించారు.  తాజాగా దివంగత శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వి కపూర్ (హీరోయిన్), ఖుషీ కపూర్ ల క్వారంటైన్ ముగిసింది. ఈ విషయాన్ని బోనీ కపూర్ సోషల్ పోస్ట్ ద్వారా తెలిపారు.

 

కరోనా పరీక్షల్లో తనకు, తన కుమార్తెలకు నెగెటివ్ అని తేలిందని..  తమ నివాసంలో పని చేసే పనిమనుషులు ముగ్గురుకి కూడా నెగెటివ్ అని నిర్ధారణ అయిందని చెప్పారు.  అయితే తమ పనులు పూర్తి గా చూసుకు నే తమ పనిమనుషులు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన అంటున్నారు. ఇదే సమయంలో తమ 14 రోజుల హోం క్వారంటైన్ కూడా ముగిసిందని తెలిపారు.

 

ఈ మేరకు ఆయన సోషల్ పోస్ట్ ద్వారా తెలిపారు. మకు సహకరించిన డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, ముంబై పోలీస్, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందరికి కృతజ్ఞతలు చెపుతున్నామని తెలిపారు. కాగా, బోనీ కపూర్ ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో... వారిని క్వారంటైన్ కు పంపించారు. తన కుమార్తెలతో కలిసి బోనీ కూడా హోం క్వారంటైన్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: