అక్కినేని యువ హీరో.. యువ సామ్రాట్ స్క్రీన్ నేమ్ కూడా దక్కించుకున్న నాగ చైతన్య కెరియర్ మంచి జోష్ లో ఉందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో హిట్ అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ అంటూ రాబోతున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల, సాయి పల్లవి మరోసారి వారి మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య పరశురామ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈమధ్యనే సూపర్ స్టార్ మహేష్ తో పరశురామ్ మూవీ కన్ఫర్మ్ చేశాడు. 

 

ఆ సినిమాకు సర్కారు వారి పాట టైటిల్ ఫిక్స్ చేశాడు. ఇదిలాఉంటే రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన రచయితా పోసాని కృష్ణమురళి నాగ చైతన్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అక్కినేని హీరోల్లో నాగ చైతన్య అంటే ఇష్టమని.. నాగార్జునతో 3 సినిమాలు చేసిన పోసాని అఖిల్ తో ఒక సినిమా చేశారట. ప్రస్తుతం అఖిల్ చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా కూడా చేస్తున్నా అని చెప్పారు. నాగ చైతన్య నిజాయితీ గల వ్యక్తి.. ప్యూరిఫైడ్ హార్ట్. . కల్లాకపటం లేని మనసు.. మోసం చేయడం తెలియదు సరికదా అతన్ని ఎవరైనా ఈజీగా మోసం చేయొచ్చని అంటున్నారు పోసాని. 

 

నాగ చైతన్య నటించిన మజిలీ సినిమాలో పోసాని నటించారు. ఆ సినిమా టైం లో అతని ప్రవర్తన చూసి నాగ చైతన్య గౌతమ బుద్ధుడు అంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు పోసాని. మొత్తానికి పోసాని మనసు గెలుచుకున్న నాగ చైతన్య తన ప్యూర్ హార్ట్ ను అలానే ఉంచుకోవాలని ఆశిద్దాం. అంత మంచివాడు కాబట్టే సమంత ఏరి కోరి పెళ్లాడిందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: