గత కొంత కాలంగా భారీ పరాజయాలను చవిచూస్తున్న స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ  సూరరై పోట్రు. ఈపాటికే విడుదలకావల్సిన ఈ చిత్రం కరోనా వల్ల వాయిదాపడింది. ఇక ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్  పనులను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగాసెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి బోర్డు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది అయితే మరో రెండు నెలల వరకు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు అయినా కూడా ఇంత తొందరగా సెన్సార్ కు పంపించడంతో  ఈచిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  
 
ఇటీవల సూర్య సతీమణి జ్యోతిక నటించిన పోన్మగళ్ వందాల్ డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యింది ఈ సినిమాకు సూర్యనే నిర్మాత. ఇక సూరరై పోట్రును శిక్య ఎంటెర్టైనెంట్స్ తో కలసి సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది దాంతో ఈసినిమా కూడా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు లేకపోలేదంటుంది కోలీవుడ్ మీడియా. త్వరలోనే ఈవిషయంలో క్లారిటీ రానుంది. 
 
గురు ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. తెలుగులో ఈచిత్రం ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో విడుదలకానుంది. ఈసినిమా తరువాత సూర్య ,హరి డైరెక్షన్ లో నటించనున్నాడు. ఈచిత్రానికి అరువ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈచిత్రం ఆగస్టు లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రంలో సూర్య సరసన రాశి ఖన్నా నటించనుంది.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: