ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసు వర్మలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుసగా మూడు ఫ్లాప్స్ తర్వాత అఖిల్ చాలా ఆశలు పెట్టుకొని నటిస్తున్న ఈ సినిమా హిట్ పక్క అన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా ఈ సినిమా సక్సస్ అన్నది ఎంతో కీలకం. ఒంగోలు గిత్త డిజాస్టర్ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి భాస్కర్ కి వచ్చిన అవకాశం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.

  

ఇక ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయడానికి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న చిత్ర యూనిట్ కి కరోనా షాకిచ్చింది. ప్రస్తుతం కరోనా దెబ్బకి అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాని నిలిపేశారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజ హెగ్డే అఖిల్ సరసన నటిస్తోంది. వరుసగా సక్సస్ లను దక్కించుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న ఈ బ్యూటి గతం లో నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

 

ఇక పూజా హెగ్డే ఈ ఇయర్ ప్రారంభంలోనే అల్లు అర్జున్ తో నటించిన అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంది. అయితే ప్రస్తుతం అఖిల్ తో నటిస్తున్న'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో పూజా హెగ్డే అఖిల్ మధ్య అద్భుతమైన రొమాంటిక్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు ఈ సీన్స్ సినిమాకి బాగా ప్లస్ అవుతాయని.. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాలో ఉన్న పూజా అఖిల్ రొమాన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: