ఎలాంటి అంచనాలు లేకుండా కెజిఎఫ్ సినిమాతో హిట్ అందుకున్నాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్. యష్ హీరోగా వచ్చిన ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు,తమిళ, హిందీ భాషల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా సీక్వల్ ఇప్పుడు సెట్స్ మీద ఉంది. కెజిఎఫ్ చాప్టర్ 2 మొదటి భాగం కంటే భారీ అంచనాలతో వస్తుంది. అసలైతే ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ కు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. 

 

ఇక డైరక్టర్ ప్రశాంత్ నీల్సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. రేడియేషన్ టైటిల్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా ఈ ఇద్దరి కాంబోలో రాబోతుందని తెలుస్తుంది. అయితే తెలుగు దర్శకులు కాకుండా తెలుగు స్టార్స్ తో తీసే ఇతర భాషా దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. అయితే యూనివర్సల్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలతో తీసేది తెలుగులోనే అయినా టార్గెట్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారు. అందుకే ప్రశాంత్ నీల్ కూడా వారి స్థానంలో నిలబడతాడు అని అంటున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ డైరక్టర్స్ శంకర్, మురుగదాస్ లాంటి వారి సరసన ప్రశాంత్ నీల్ కూడా చేరుతాడని చెప్పొచ్చు. 

 

ఎన్టీఆర్ తో సినిమా తర్వాత ప్రభాస్ తో మరో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. మరి ఈ రెండు మెగా ప్రాజెక్ట్స్ పూర్తి అయితే ప్రశాంత్ నీల్ తెలుగులో కూడా టాప్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నట్టే లెక్క. కెజిఎఫ్ 2 కూడా అంచనాలను అందుకునే తప్పకుండా ప్రశాంత్ నీల్ డిమాండ్ డబుల్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఆ సినిమాను ఏం చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: