రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన రామ్ చరణ్ లుక్ కి విశేష స్పందన లభించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది.

 

అయితే అన్నీ సవ్యంగా కుదిరితే ఈ సినిమాని వచ్చే జనవరిలో విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా మహమ్మారి వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తీస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసాడు.

 

అయితే ఈ విషయమై మహేష్ బాబు ఇంకా స్పందించలేదు. రాజమౌళితో సినిమా ఉంటుందని చెప్పినప్పటికీ అది ఎప్పుడు ఉంటుందనేది మాత్రం వెల్లడి చేయలేదు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రాన్ని స్టార్ట్ చేసాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో కన్ఫర్మ్ లేదు కాబట్టి, మహేష్ పరశురామ్ తో సినిమా తర్వాత మరో సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది.

 

ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమా తర్వాత రాజమౌళి ఖచ్చితంగా గ్యాప్ తీసుకుంటాడు. అదీ గాక ఇంకా కథ, కథనాలు రెడీ కాలేదు. సో వాటిని రెడీ చేసే గ్యాప్ లో మహేష్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ క్యూలో ఉన్న డైరెక్టర్లతో సినిమా చేస్తాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: