ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అందాల భామ పూజా హెగ్డే. ఒక టైం ఈ బ్యూటీ ఉదయం ముంబైలో షూటింగ్ చేసి రాత్రికి హైదరాబాద్‌లో మరో సినిమా షూటింగ్‌కు హాజరయ్యేది. అంతా బిజీగా ఉండే ఈ బ్యూటీ ప్రస్తుతం లాక్‌ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. షూటింగ్‌లు పూర్తిగా ఆగిపోవటంతో ఈ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తోంది.

 

ఈ నేపథ్యంలో తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా స్పెండ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది పూజా హెగ్డే. తాజాగా తన భామతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హోం మిత్ మై బంగారం అంటూ కామెంట్ చేసిన పూజా.

 

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పలు బాలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Home with my gundu/jigar ka tukda/bangaram ❤️ #ajji #grandma #cutie

A post shared by pooja Hegde (@hegdepooja) on

మరింత సమాచారం తెలుసుకోండి: