నందమూరి బాలకృష్ణ కెరీర్ లో వచ్చిన ది బెస్ట్ సినిమాల్లో ఒకటి వంశోద్దారకుడు. ఈ సినిమాలో ఆయన నటన తో పాటుగా కొన్ని కొన్ని సన్నివేశాలు హీరోయిన్ నటన అన్నీ కూడా హైలెట్ ప్రతీ సీన్ కూడా యువతను చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్యలో ఉన్న యాక్షన్ హీరోని పరిచయం చేసిన సినిమా అదే అనేది కొందరి మాట. ఆ సినిమాలో బాలయ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక కథ కూడా చాలా బాగా నచ్చింది కొందరికి అని చెప్పవచ్చు. అదే విధంగా సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు బాలకృష్ణ లో ఉన్న పూర్తి స్థాయి నటుడ్ని బయటకు తీసుకొచ్చాయి. 

 

ఆ సినిమాలో  సాక్షి శివానంద్  నటించిన సంగతి తెలిసిందే. ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి ఆ సినిమాలో అని చెప్పవచ్చు. ఆమె చాలా అందంగా కనపడింది ఆ సినిమాలో అని చాలా మంది కామెంట్స్ కూడా చేసారు. ఇక అది పక్కన పెడితే ఆ సినిమాలో ఉన్న ఒక పాట యువతకు చాలా బాగా నచ్చింది. వర్షంలో ఉండే ఆ పాటకు అప్పుడు చాలా మంచి స్పందన వచ్చింది. బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో అనే పాటకు అప్పటి యువత ఫిదా అయిపోయారు అని చెప్పవచ్చు. 

 

దాన్ని ఇప్పటికి కూడా యుట్యూబ్ లో చూస్తూ ఉంటారు అనేది వాస్తవం. ఆ విధంగా ఆ పాట హిట్ అయింది అని చెప్పాలి. ఇక ఆ పాటలోసాక్షి శివానంద్ నడుం గురించి ప్రత్యేకంగా యువతలో చర్చ జరిగింది. బాలయ్య బాబు ఆమెతో బాగానే రోమాన్స్ కనపడకుండా చేసారు అంటూ కొందరు కామెంట్స్ చేసారు. కాగా బాలకృష్ణ ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: