ఇండియన్ సినిమాలో ఒక సంచలనం బాజీరావు మస్తాని. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ లు గా రణవీర్ సింగ్ ప్రియాంకా చోప్రా, దీపిక పదుకొనే నటించారు. ఈ సినిమాను ఒక మరాఠా రాజు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన ప్రేమ ఆధారంగా తీసుకొచ్చారు. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు అయితే థియేటర్ లో పూలు జల్లిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు. దీపిక, ప్రియాంక రణవీర్ మధ్యన ఉన్న ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తు ఉన్నాయి. 

 

సినిమా సాధించిన వసూళ్లు కూడా హైలెట్ గా నిలిచాయి. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఇంకా యుట్యూబ్ లో సెర్చ్ చేసే విధంగా ఉంటాయి. అలాగే ఒక ప్రత్యేక సన్నివేశం ఈ సినిమాలో ఉంటుంది. బాజీరావు మస్తాని ఉన్న ఒక కోట వద్దకు వెళ్తాడు. ఆ సందర్భంగా ఆమె బాజీరావు ని చూసి బయటకు వస్తుంది. ఇక మన ప్రేమను ఎవరూ అంగీకరించే అవకాశం లేదని, అదే విధంగా తన భార్య  కాశీ కూడా అంగీకరించే అవకాశం లేదని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా సరే ఆమె ఎక్కడా వెనక్కు తగ్గే అవకాశం ఉండదు. 

 

దీనితో ఆమెను వర్షంలోకి తీసుకుని వెళ్లి ఈ వర్షం సాక్షిగా ఈ భూమి సాక్షి గా ఈ ఆకాశం సాక్షిగా అంటూ ఒక డైలాగ్ చెప్పడం ఆ తర్వాత ఇక నుంచి బాజీరావు మస్తాని ఇద్దరు కాదు ఒకరే అని చెప్తాడు. అప్పుడే టైటిల్ ని అక్కడ చెప్తాడు. బాజీరావు మస్తాని అంటాడు. ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. దర్శకుడు కూడా చాలా అందంగా తీసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: