ప్రపచంలో కరోనా ఎప్పటి నుంచి మొదలైందో కానీ అప్పటి నుంచి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కరోనా కేసులు పెరిగిపోతున్నాయని మార్చి 24 న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటికే విదేశాల్లో ఉన్నవారు.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ ‘ఆదుజీవితం’ షూటింగ్ నిమిత్తం జోర్డాన్కి వెళ్ళగా, లాక్డౌన్ వలన దాదాపు రెండు నెలలు అక్కడే ఉండిపోయాడు. భారత్ చేపట్టిన వందే భారత్ మిషన్లో భాగంగా ‘ఆదుజీవితం’ చిత్ర బృందం మే 22న ప్రత్యేకం విమానంలో భారత్ తిరిగొచ్చారు.
అనంతరం కేరళకు చేరుకున్న వీరందరిని 14 రోజులుపాటు క్వారంటైన్లో ఉంచారు. అయితే క్వారంటైన్ లో ఉన్న పృథ్వీరాజ్ కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. దాంతో అతని కుటుంబ సభ్యలు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తమ హీరోకి ఎలాంటి కరోనా మహమ్మారి సోకలేదని తెగ సంబరంలో ఉన్నారు. తన భార్య సుప్రియా మీనన్, గారాల కూతురు అలంకృతాతో దిగిన ఫ్యామిలీ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘ ఎట్టకేలకి మళ్లీ ఒకటయ్యాం’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ ఫోటోలో అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది.
View this post on Instagram