క్యాస్టింగ్ కౌచ్.. తెలుగు ఇండస్ట్రీతో పాటు చాలా ఇండస్ట్రీలను పట్టి పీడిస్తున్న ఓ మహమ్మారి ఇది. అవకాశాల పేరుతో అమ్మాయిల్ని పడకగదికి రప్పించుకుని వాళ్ళతో అవసరం తీర్చుకున్నాక వేషం ఇవ్వకుండా ముఖం చాటేయడమే ఈ క్యాస్టింగ్ కౌచ్. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ మొదట సాక్ష్యాధారాలతో శ్రీరెడ్డి గుట్టు రట్టు చేసి సంచలనం సృష్టిస్తోంది. ఇక అప్పటి నుంచి ఈ పేరును అందరూ మర్చిపోతున్నారు అనుకున్న టైమ్లో.. ఎవరోఒకరు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మేము పలనా దర్శకుడు వలనో లేక నిర్మాత వలనో లేక హీరో వలనో మోసపోయాం అంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
స్టార్ హీరోయిన్లు సైతం పని గట్టుకుని మరీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. అయితే తాజాగా నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శిరీష ఓ ఇంటర్వ్యూ లో ఈ చీకటి గుట్టుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నేటి యువతరం నటీనటులను కొంతమంది దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇప్పిస్తామని తమ శారీరక వాంఛలను తీర్చుకుంటున్నారని, తీరా అవసరం తీరిపోయాక కూరలో నుంచి కరివేపాకు తీసిపారేసినట్లు తీసి పారేస్తున్నారని శిరీష హాట్ కామెంట్స్ చేసింది. ఇక తనని కూడా అవకాశాల పేరుతో కమిట్మెంట్ అడిగి, తీసుకుని ఇప్పుడు కనీసం తన ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేగాక తాను కమిట్ మెంట్ ఇచ్చిన వ్యక్తులు ప్రస్తుతం సినీ పరిశ్రమలో బాగానే రాణిస్తున్నారని.. కానీ, తన వంక మాత్రం చూడడం లేదని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే నటి శిరీష.. తాను ఎంతో ఇష్టపడి నటిగా ఎదగాలని సినీ పరిశ్రమకు వచ్చానని కానీ ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఎందుకు సినిమా పరిశ్రమకి వచ్చానా అని అనేకమార్లు బాధపడిన సంఘటనలు కూడా ఉన్నాయని వాపోయింది. కాగా, నటి శిరీష 50 కు పైనే సినిమాల్లో నటించింది. మరియు ఐటెం గర్ల్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది.