బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. భారీ ప్రాజెక్ట్ లు చేస్తూ ప్రభాస్ ఇప్పుడు బిజీ గా ఉన్నాడు. ప్రభాస్ తో ప్రస్తుతం అందరూ కూడా అగ్ర నిర్మాతలే సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ కూడా వారితోనే సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రభాస్  ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాను చేస్తున్నాడు. మరో సినిమాను కూడా అతను లైన్ లో పెట్టాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. 

 

అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా అగ్ర దర్శక నిర్మాతలతో కాబట్టి అతను భవిష్యత్తులో కూడా వాళ్ళతోనే ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ పేరు రాకుండా ఉండటానికి గానూ ప్రభాస్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకసారి కమర్షియల్ హీరో అనే గుర్తింపు వస్తే సినిమాలు చేయడానికి నిర్మాతలు దర్శకులు భయపడే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రభాస్ ఇప్పుడు కాస్త జాగ్రత్తగా సినిమాలు చెయ్యాలి అని భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ప్రభాస్ ప్రస్తుతం చిన్న నిర్మాతలతో కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను మిస్టర్ పర్ఫెక్ట్ తరహాలో తక్కువ బడ్జెట్ లో ఒక లవ్  సినిమా చెయ్యాలి అని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిజం ఎంత అనేది తెలియదు గాని దీనిని మాత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. రాధాక్రిష్ణ తో చేస్తున్న సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ తో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: