సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఓవర్సేస్ లో మొదటి మిలియన్ మార్క్ అందుకున్న హీరో మహేష్ బాబు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులు మహేష్ సినిమాలు చూసేస్తారు. అందుకే మహేష్ సినిమాలు ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతాయి. అంతేకాదు మహేష్ తో సినిమా చేయాలనుకునే నిర్మాతల సంఖ్యా ఎక్కువే. అందుకే మహేష్ తన సినిమా నిర్మాతల కాంబోలో చేస్తుంటాడు. అందరిని సంతృప్తి పరచేలా ఎవరిని నొప్పించకుండా చేస్తాడు. 

 

అంతకుముందు సినిమాలే కాదు లేటెస్ట్ గా సర్కారు వారి పాట సినిమాకు కూడా మహేష్ రెండు పెద్ద ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ రెండు బ్యానర్ లు మహేష్ సొంత బ్యానర్ లానే ఫీల్ అవుతాడు. అంతేకాదు 14 రీల్స్, మైత్రి మూవీస్ రెండు బ్యానర్ లు మహేష్ సినిమాతోనే మొదలయ్యాయి. మైత్రి మేకర్స్ ఒక్కరే సర్కారు వారి పాట నిర్మించే ఛాన్స్ ఉంది కానీ 14 రీల్స్ వారికి లిఫ్ట్ ఇచ్చేలా వాళ్ళని కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం చేశాడు మహేష్. 

 

ఇక ఎలాగూ తన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కూడా పోస్టర్ లో ఉంటుంది. తాను తీసుకునే రెమ్యునరేషన్ ఏదో కొద్దిమొత్తంలో తీసుకుని ఏదో ఒక ఏరియా రైట్స్ తానూ తీసుకుంటాడు మహేష్. ఇలా చేయడం వల్ల బడ్జెట్ కంట్రోల్ అవడమే కాకుండా సినిమా క్వాలిటీ కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మహేష్ ఈ కాంబో ఆఫర్ నచ్చని కొంతమంది మాత్రం తనతో సోలోగా చేసే చేయక తప్పదు. మరి మహేష్ అందరివాడు అనిపించుకునేలా చేస్తున్న ఈ సినిమాలు మంచి సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.             

 

మరింత సమాచారం తెలుసుకోండి: