తెలుగు చిత్ర పరిశ్రమలో రెయిన్ సాంగ్స్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే నేటి తరం హీరోలు చాలామంది ఒకప్పటి హీరో ల సినిమాల్లోని రైన్  సాంగ్స్ ని రీమేక్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి జోడీగా చేసిన రైన్  సాంగ్ ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటను రెబల్ స్టార్ ప్రభాస్ మళ్లీ రీమేక్ చేసి అడవి రాముడు సినిమాలో  మరోసారి అలరించాడు. ఇక ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాలు చిరంజీవి విజయశాంతి మధ్య వచ్చే రైన్ సాంగ్ వాన వాన వెల్లువాయే సాంగ్ అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో టాలీవుడ్ ను షేక్ చేసింది ఈ పాట. విజయశాంతి చిరంజీవి జోడి తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్గా మారేలా చేసింది. 

 

 అయితే ఎన్నో ఏళ్ల తరువాత మళ్లీ ఈ సాంగ్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీమేక్ చేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా తమన్నా హీరోయిన్గా నటించిన రచ్చ సినిమాలో వాన వాన వెల్లువాయే అనే పాటను రీమేక్ చేశాడు రామ్ చరణ్. అప్పట్లో చిరంజీవి విజయశాంతి ఈ పాటలో  డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టే తమ  కెమిస్ట్రీతో  అందరిని ఆకర్షించగా... ఇక చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తమన్నాతో ఈ పాట పై అదిరిపోయే స్టెప్పులు వేస్తూ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు అనే చెప్పాలి. 

 


 అప్పట్లో సెన్సేషన్ సృష్టించడమే కాదు రామ్ చరణ్ రీమేక్ చేసిన వాన వాన వెల్లువాయే పాట ఇప్పట్లో కూడా సెన్సేషన్  సృష్టించింది అనే చెప్పాలి. ఈ పాట తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ ఎవర్గ్రీన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఈ పాటలు రామ్ చరణ్ తమన్నా చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మర్చిపోలేను అనే చెప్పాలి. ఇక ఈ పాట వస్తుందంటే కాసేపు ఆగి మరి చూస్తూ ఉంటారు ప్రేక్షకులు అంతగా ప్రేక్షకులను ప్రభావితం చేసింది ఈ పాట. అయితే అప్పుడు తండ్రి చేసిన ఇప్పుడు తనయుడు చేసిన ఈ పాటకి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి. ఏమైనా రెయిన్ సాంగ్ క్రేజే వేరు మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: