దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఉండ బోతున్నట్లు మొన్నటిదాకా కన్ఫర్మ్ అయిన వార్తలు అందరం చూశాం. స్వయంగా రాజమౌళిటీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నెక్స్ట్ మహేష్ బాబు తోనే అని చెప్పటం మనందరం చూశాం. ఎప్పటినుండో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లే వచ్చి వాయిదా పడుతోంది. 'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు అప్పట్లో ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జూన్ లో కంప్లీట్ అవుతుందని అందరూ భావించిన సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి గాయాలు అవ్వడం వలన సినిమా షూటింగ్ కొద్ది నెలలపాటు ఆలస్యమైంది.

IHG'There is no hurry ...

దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు రాజమౌళి అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ దెబ్బకు సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కావడంతో, మహేష్ బాబు తో రాజమౌళి సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ నుండి వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

IHG

వాస్తవానికి పరశురాం సినిమా తర్వాత రాజమౌళి సినిమా మహేష్ బాబు చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ దెబ్బకు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో మహేష్ పరుశురాం సినిమా తర్వాత మరో డైరెక్టర్ తో చేయబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. దీంతో రాజమౌళితో మహేష్ సినిమా ఆలస్యం అవ్వుతున్నట్లు అర్ధమవుతోంది. ఇదే నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి ఇది అతి పెద్ద నిరాశే  అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: