టాలీవుడ్ లో ఇప్పుడు సంచలనంగా మారిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా ఒక సంచలనం ఇప్పుడు సోషల్ మీడియాలో. ఎప్పుడు అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని ఈ సినిమాకు సంబంధించిన లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసిందో ఇక అప్పటి నుంచి కూడా కాస్త సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఏదోక వార్త వస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కథకు సంబంధించిన తుది మెరుగులను దర్శకుడు దిద్దే ప్రయత్న౦ చేస్తున్నాడు. దీనిపై త్వరలోనే ఒక కీలక ప్రకటన కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలకు సంబంధించి మహేష్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ముఖ్యంగా పల్లెటూరు ప్రాంతంలో షూట్ చేసే సీన్స్ విషయంలో మహేష్ బాబు అభ్యంతరం చెప్పాడు అని సమాచారం. ఒక అడవిలో ఫైట్ సీన్ ఉంటుందని అందులో బురదలో మహేష్ ఫైట్ చెయ్యాలి అని గతంలో తాను అలా చేసిన సమయంలో స్కిన్ సమస్యలు వచ్చాయి అని తాను చేయలేను అని చెప్పాడట. అయితే ఆ బురదను మారిస్తే ఏమైనా ట్రై చేస్తా అని చెప్పాడట. 

 

అయితే అది పైకి వినపడానికి చిన్న సమస్యే అయినా సరే మహేష్ కి మాత్రం చాలా పెద్ద సమస్య అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం హీరోయిన్ ని మార్చే ఆలోచనలో కూడా చిత్ర యూనిట్ ఉంది అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక మంధన లేదా బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. మరి ఎవరిని ఎంపిక చేస్తుంది చిత్ర యూనిట్ అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: