కేజిఎఫ్ సినిమా తో ఒక్కసారిగా సంచలన దర్శకుడు అయిపోయాడు ప్రశాంత్ నీల్. అతని సినిమాల గురించి అప్పటి వరకు జనాలకు పెద్దగా తెలియదు గాని ఆ సినిమా తర్వాత మాత్రం అతను ఒక సంచలన దర్శకుడు అయిపోయాడు. ఇప్పుడు ఆ దర్శకుడి కోసం తెలుగుతో పాటుగా హింది లో తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉంది అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అతను ఇప్పుడు రెండు మూడు సినిమాలను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి తెలుగులో, హిందీలో సినిమా చేయడానికి గానూ రణవీర్ సింగ్ తో ఓకే చెప్పాడు అని సమాచారం. 

 

ఇక ఇప్పుడు అతని కోసం తెలుగులో పోటీ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉన్న ఎన్టీఆర్ తర్వాత చేసేది త్రివిక్రమ్ సినిమా. ఈ సినిమా తర్వాత అతను ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత మాత్రం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పిన ప్రశాంత్ ని ఎలాగూ ఆర్ఆర్ఆర్ సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కేజిఎఫ్ సినిమా కూడా లేట్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి... ఈ సినిమా ఎలాగూ సంక్రాంతికి విడుదల అవుతుంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా వచ్చే ఏడాది చివర్లో అవుతుంది. 

 

అందుకే ఇప్పుడు రామ్ చరణ్ అతని తో సినిమా చేయడానికి గానూ ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ తో చర్చించాడు. ఎన్టీఆర్ తో కూడా ఒక మాట చెప్పినట్టు సమాచారం. ప్రశాంత్ దగ్గర ఒక కథను గత ఏడాది రామ్ చరణ్ వినట్టు సమాచారం. ఇప్పుడు దానిని సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. మరి ఎంత వరకు తీసుకుని వెళ్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: