సూపర్ స్టార్ మహేష్ తన 27వ సినిమాను పరశురామ్ డైరక్షన్ లో ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సర్కారు వారి పాట అంటూ టైటిల్ పోస్టర్  సినిమాపై అంచనాలు పెంచాడు పరశురామ్. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన సూపర్ స్టార్ మహేష్ పరశురామ్ డైరక్షన్ లో సర్కారు వారి పాటతో కూడా డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా పరశురామ్ గీతా గోవిందం సినిమాతో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే సినిమా తీసి అందరికి షాక్ ఇచ్చాడు. 

 

గీత గోవిందం తర్వాత తీస్తే స్టార్ తోనే సినిమా తీయాలని వెయిట్ చేసిన పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ ను మెప్పించే కథ సిద్ధం చేశాడు. సర్కారు వారి పాటతో పరశురామ్ కూడా స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకు పరశురామ్ రెమ్యునరేషన్ గా భారీ మొత్తం తీసుకుంటున్నాడని తెలుస్తుంది. సినిమాకు రెమ్యునరేష్ గా 8 కోట్లు డిమాండ్ చేయగా  అడ్వాన్స్ గా 4 కోట్లు తీసుకున్నాడట.  

    

సినిమా రిలీజై సూపర్ హిట్ అయితే మరో 20% లాభాల్లో వాటా ఉంటుందట. అంటే మొత్తం సర్కారు వారి పాట సినిమాకు ఎలా లేదన్నా 10 కోట్ల దాకా వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. వెయిట్ చేసినా సరే దానికి తగినట్టుగా పారితోషికం భారీగానే వసూళు చేస్తున్నాడు పరశురామ్. సర్కారు వారి పాట సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న థమన్ మహేష్ సినిమాకు మ్యూజిక్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ భామ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.             

మరింత సమాచారం తెలుసుకోండి: