యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా క్రేజ్ ని సాధించాడు. బాహుబలి సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఏకంగా బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ మేకర్స్ కూడా ప్రభాస్ వైపు చూసేలా స్టార్ డం దక్కింది. ఇదంతా దర్శక ధీరుడు రాజమౌళి హ్యాండ్ తోనే సాధ్యమైందని చెప్పాలి. ఇక ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తోనే సాహో అన్న భారీ బడ్జెట్ సినిమా తీశాడు. 

 

అయితే ఈ సినిమా ఒక్క బాలీవుడ్ లో తప్ప మిగిలిన అన్ని చోట్లా నిరాశపరచింది. అయినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే మరోసారి భారీ సినిమాతో రావాలని చూస్తున్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయున్ గా నటిస్తుండగా ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

 

అయితే ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. కరోనా కారణంగా ఇక విదేశాలలో షూటింగ్ జరప కూడదని మిగతా షూటింగ్ మొత్తాన్ని హైదరాబాద్ లోనే అందులో కూడా ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గ సెట్స్ కూడా రెడీ అయినట్టు సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుండి సర్‌ప్రైజ్ న్యూస్ వస్తుందని ఎదురు చూస్తున్న అభిమానులకి నిరాశనే మిగులుతుంది.

 

వాస్తవంగా ఈ సినిమా టైటిల్ విషయంలో ముందు నుంచి సందిగ్ధత నెలకొంది. కొన్నాళ్ళు జాన్ టైటిల్ అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాధే శ్రామ్ అన్న టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ రెండిటిలో ఏ టైటిల్ ఫైనల్ చేస్తారో తెలియనప్పటికి ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ తో పాటు అఫీషియల్ గా టైటిల్ ని రిలీజ్ చేసి గుడ్ న్యూస్ చెప్తాడని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ని ప్రభాస్ నిరాశ పెడుతున్నాడు. కనీసం ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారో చిన్న హింట్ కూడా యూనిట్ నుండి రావడం లేదు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్నాడని ఫీలవుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: