ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తన రెండవ సినిమాని తెరకెక్కించడానికి చాలా కష్టాలని ఎదుర్కొంటున్నాడు. మొదటి సినిమా హిట్ అయిన దర్శకుడితో పనిచేయాలని ప్రతీ ఒక్క హీరో అనుకుంటాడు. కానీ అజయ్ భూపతి విషయంలో ఇది రివర్స్ గా సాగింది. మహాసముద్రం అనే స్క్రిప్టుతో ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న అజయ్ కి శర్వా హీరోగా దొరికాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద్, అజయ్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఓకే చేసాడు.

IHG

 

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో ఉన్న శ్రీకారం సినిమా పూర్తవగానే మహాసముద్రం పట్టాలెక్కనుంది. అయితే మహాసముద్రంలో శర్వాతో పాటు మరో హీరో కూడా ఉన్నారు. ఆ స్థానంలో తమిళ నటుడు సిద్ధార్థ్ ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కథ విన్న సిద్ధార్థ్ చేస్తానని చెప్పాడట కూడా. కానీ సడెన్ గా ఏమైందో ఏమోగానీ సిద్ధార్థ్ మహాసముద్రం నుండి తప్పుకున్నాడని అన్నారు.

IHG

 

దాంతో అజయ్ భూపతి సెకండ్ హీరో కోసం వెతకడం ప్రారంభించాడు. ప్రస్తుతం అజయ్ కి మరో తమిళ హీరో దొరికాడని సమాచారం. వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో కనిపించిన అథర్వ మురళిని మహాసముద్రం సినిమాలో సెకండ్ హీరో గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైతే అధికారికంగా సమాచారం లేనప్పటికీ దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని వినిపిస్తుంది. 

 

 

మహాసముద్రం పేరే కాదు స్క్రిప్టు కూడా చాలా కొత్తగా ఉంటుందట. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, స్టోరీ వరల్డ్ ఎవ్వరూ ఊహించకుండా ఉంటుందని అంటున్నారు. మరి ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకైనా అజయ్ భూపతికి మహాసముద్రం ద్వారా సాలిడ్ హిట్ వస్తుందెమో చూడాలి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: