రాశి ఖన్నా.. ఈ పేరు ప్రత్యేకింగా పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్కు చెమటలు పట్టిస్తున్న ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ లో నటించి సూపర్ హిట్ అందుకుంది.
అప్పటి వరకూ కాస్త బొద్దుగా ఉంటూ.. గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన రాశీ ఖన్నా లో ఇంత గొప్ప నటి ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఆ చిత్రం. ఇక అందాల ఆరబోతలోనూ నేను ఎక్కడా తగ్గనని చాలా సార్లు నిరూపించుకుంది ఈ బ్యూటి. ఇక రాశీ ఖన్నా క్యూట్ అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అన్నట్టుగా ఆకట్టుకుంది. అలాగే ఇటీవల వెంకీ మామ, ప్రతీరోజూ పండగే వంటి చిత్రాలతో సూపర్ హిట్లు అందుకుంది.
దాంతో ఈమెకు గుడ్ టైం స్టార్ట్ అయ్యింది అని అంతా అనుకున్నారు. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఈమెకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ చిత్రంలో రాశీ రొమాన్స్ శృతి మించడంతో నెటిజన్స్ ఆమెపై సీరియస్ అయ్యారు. దీంతో ఇంకోసారి అలాంటి పాత్రలు చేయకూడదని డిసైడ్ అయింది ఈ బ్యూటి. ఇక ప్రస్తుతం ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది.
ఇప్పుడు తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తుండటంతో… తమిళంను నేర్చుకుంటున్నారు. ఈ ముద్దుగుమ్మ సుందర్ సి దర్శకత్వంలో ‘అరణ్మనై-3’తో పాటు సూర్య ‘అరువా’ చిత్రంలోనటిస్తున్నారు. అలాగే మేధావి చిత్రంలో జీవాకు జోడీ నటిస్తుంది.