ఇప్పుడు టాలీవుడ్ లో మెగా హీరోల సినిమాలకు ఒక క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మెగా హీరోల సినిమాల కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. చిరంజీవి నుంచి నిన్నా మొన్న వచ్చిన హీరోల వరకు కూడా అందరూ ఇప్పుడు టాలీవుడ్ లో తమ మార్క్ ని వేసారు అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో  మెగా ఫాన్స్ ని కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే అది మరీ బాధ పెట్టే వార్త కాదు గాని కాస్త ఇబ్బంది పెట్టే వార్త. ఈ ఏడాది మెగా హీరోలు ఎవరూ కూడా సినిమాలను విడుదల చేయవద్దు అని నిర్ణయానికి వచ్చారు అని సమాచారం. 

 

ఇదే విషయం చిరంజీవి వారికి చెప్పినట్టు టాలీవుడ్ లో టాక్ ఈ ఏడాది ఏ సినిమా కూడా విడుదల చేయవద్దు అని ఇప్పుడు ఎక్కువగా సినిమా ఇబ్బంది పడుతుంది అని అనవసరంగా త్వర పడి సినిమాలను విడుదల చేయవద్దు అని ఆయన సలహా ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొన్ని రోజుల పాటు సినిమాల విడుదలకు దూరంగా ఉండాలి ఇప్పుడు ఆడియన్స్ హాల్ కి వచ్చే పరిస్థితి లేదు అని ఆయన  చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. అగ్ర హీరోలు కూడా చాలా మంది చిరంజీవి సలహాను ఫాలో అవుతున్నారు అని తెలుస్తుంది. 

 

రామ్ చరణ్ కూడా ఇప్పుడు సినిమాను విడుదల చేసే అవకాశం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కూడా వాయిదా వేసుకున్నాడు అని సమాచారం. అదే విధంగా ఇతర హీరోలు కూడా విడుదల చేస్తే ఓటీటీ లో విడుదల చెయ్యాలి గాని మాములుగా వద్దు అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: