మనంతో అక్కినేని కుటుంబానికి మరుపురాని హిట్ ఇచ్చాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఆతరువాత అఖిల్ తో హలో చేసిన విక్రమ్ ఇప్పుడు రెండో సారి నాగ చైతన్య తో  సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు అయితే ఈసినిమా హారర్ జోనర్ లో తెరకెక్కనుందని ఇటీవల వార్తలు వచ్చాయి కానీ అవి నిజం కాదని రెగ్యులర్  కమర్షియల్ ఎంటర్ టైనర్ గానే సినిమా ఉంటుందని విక్రమ్ కుమార్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి థాంక్యూ అనే టైటిల్ పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దిల్ రాజు ఈసినిమాను నిర్మించే అవకాశాలు వున్నాయి. 
 
ఇక గత ఏడాది మజిలీ ,వెంకీ మామ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి ఫామ్ లోకి వచ్చిన నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరి లో నటిస్తున్నాడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. దాంతో ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు వున్నాయి. మరో 10రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుంది. ఆగస్టు లో లేదా సెప్టెంబర్ లో ఈసినిమాను విడుదలచేయాలని చూస్తున్నారు.
 
ఇక లవ్ స్టోరి ఓవర్సీస్ హక్కులను వీకెండ్ సినిమాస్ 5.5కోట్లకు దక్కించుకోగా డిజిటల్ హక్కులను ఆహా 6కోట్లకు దక్కించుకుంది. నూతన సంగీత దర్శకుడు పవన్ సంగీతం అందిస్తుండగా ఏషియన్ సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ల పై నారాయణ దాస్ నారంగ్ , రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం నాగ చైతన్య  హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: