సామాజిక మాధ్యమాలు వచ్చినప్పటి నుండి ఏ సందేశమయినా క్షణాల్లో వచ్చేస్తుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే. అయితే వచ్చిన ప్రతీ వార్తని నమ్మడానికి లేదు. సోషల్ మీడియా వేదికగా ఎన్నో పుకార్లు బయటకి వస్తుంటాయి. అవన్నీ నిజమని నమ్మి, వెరిఫై చేసుకోకుండా ఫార్వార్డ్ చేసామంటే చివరికి బొక్క బోర్లా పడతాం. ప్రస్తుతం ప్రముఖ కాలమిస్ట్ శోభా డే పరిస్థితి అలాగే మారింది.

 

శోభాడే కాలమిస్టే కాదు నావలిస్ట్ కూడా. సమాజంలో జరిగే అంశాలపై స్పందిస్తూ కనిపిస్తుంటుంది. అయితే అంత పెద్ద నావలిస్టు అయ్యుండి కూడా ఇంపార్టెన్స్ విషయాల్లో కూడా సదరు కన్ఫర్మేషన్ లేకుండా తేలిగ్గా తీసుకుని అభిమానులతో పంచుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటని ఆలోచిస్తున్నారా.. నిన్నటికి నిన్న క‌న్న‌డ హీరో, సీనియ‌ర్ న‌టుడు అర్జున్ మేన‌ల్లుడు అయిన చిరంజీవి స‌ర్జా గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం పాలైన సంగ‌తి తెలిసిందే.

 

ఈ వార్తని చూసిన శోభా డే చిరంజీవి అని పేరుండగానే మన మెగాస్టార్ చిరంజీవి  అనుకుని, మరో సినీ దిగ్గజం నేలరాలిపోయిందంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మెగాస్టార్ ఫోటో కూడా పెట్టింది. అంత పెద్ద వార్తని జనాలతో పంచుకుంటున్నప్పుడు కనీసం వెరిఫై చేసుకోవాలన్న విషయం కూడా మర్చిపోయింది. పేరు చిరంజీవి అయినంత మాత్రాన వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదనుకుందో ఏమో ఏకంగా చిరంజీవి ఫోటో పెట్టేసింది.

 


దీంతో మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మెగా అభిమానులే కాదు తెలుగు వారందరూ ఈ విషయమై శోభా డేని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇంతటి నిర్లక్ష్యం ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలు, విమర్శలు, తిట్లు పెరుగుతుండడంతో తన తప్పు తెలుసుకున్న శోభాడే వెంటనే  ఆ ట్వీట్ ని డిలీట్ చేసింది. అయినా కూడా తిట్ల వర్షం ఇంకా తగ్గట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: