తెలుగు ఇండస్ట్రీలోకి రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే.  ఆ తర్వాత బోయపాటి శ్రీనివాస్, నందమూరి బాలకష్ణ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గస్ట్ హిట్ చిత్రం ‘లెజెండ్’ చిత్రంలో నటించింది.  ఆ తర్వాత లయన్ చిత్రంలో నటించింది.  ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రంలో నటించింది.  ఇలా స్టార్ హీరోల సరసన నటించిన రాధికా ఆప్టే ఎప్పడూ కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతూ... సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంది. అంతే కాదు ఈ అమ్మడు బోల్డ్ చిత్రాల్లో కూడ నటించి వివాదాలకు తెరలేపింది.  పెళ్లై, కుమారుడు ఉన్నప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా... తనదైన శైలిలో నటించడం రాధిక స్పెషాలిటీ. 

IHG

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి వల్ల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి... దాంతో సెలబ్రెటీలు అందరూ ఇంటిపట్టున ఉంటున్న విషయం తెలిసిందే.  తాజాగా రాధికా ఆప్టే  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా ఇంత కూడా విరామం లేకుండా గడిపానని.. షూటింగ్స్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని తెలిపింది. ఇప్పుడు తనకు విరామం దొరికిందని చెప్పింది. స్వయంగా తానే కొన్ని కథలు రెడీ చేసుకుంటున్నానని తెలిపింది.

IHG

భవిష్యత్తు గురించి తాను ఎక్కువగా ఆలోచించనని... ఎందుకంటే జీవితంలో అసంతృప్తి ఎక్కువైతే సంతోషం దూరమవుతుందని చెప్పింది. డబ్బు మాత్రమే ప్రాధాన్యత కాదని.. కుటుంబం సంతోషంగా ఉంటే తాము సంతోషంగా ఉంటామని చెప్పింది.  ఆనందంగా జీవితాన్ని గడపడమే తనకు ముఖ్యమని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ప్రశాంతంగా ఆలోచిస్తుంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయని చెప్పింది. సినిమా కెరీర్ ను పూర్తిగా పక్కన పెట్టేసి, రెస్టారెంట్ బిజినెస్ ను ప్రారంభిస్తే ఎలాగుంటుందనే ఆలోచన కూడా వచ్చిందని తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: