టాలీవుడ్ లో సర్కారు వారి పాట సినిమా ఇప్పుడు ఒక సంచలనం. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని మహేష్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ లుక్ లో మహేష్ బాబుని అభిమానులు ఇప్పటి వరకు చూడలేదు. ఆ లుక్ ని చూసిన మహేష్ ఫాన్స్ అయితే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది అనే దాని మీద అనేక చర్చలు నడుస్తున్నాయి ఇప్పుడు. 

 

ఇక ఈ తరుణంలో ఒక వార్త బయటకు వచ్చింది. మహేష్ బాబు ఈ సినిమా ద్వారా మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసాడు అనేది టాలీవుడ్ జనాల మాట. మాస్ ఆడియన్స్ లక్ష్యంగా ఈ సినిమాను మహేష్ తీసుకోస్తున్నాడు అని అతనికి మాస్ లో ఫాలోయింగ్ లేదు అని అందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దర్శకుడు కూడా ఈ సినిమా కథను అదే విధంగా ఉండేలా ప్లాన్ చేసాడు అనేది టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న మాట. ఈ సినిమా వసూళ్ళ మీద కూడా మహేష్ బాబు ఎక్కువగా ఫోకస్ చేసాడు అని అంటున్నారు. 

 

నిజం ఎంత అనేది తెలియదు గాని ఈ సినిమా మాత్రం ఇప్పుడు మాస్ కి దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి అని ఆ చిత్ర యూనిట్ కూడా చెప్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరి తో సినిమా చేస్తాడు అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ సినిమాలో మహేష్ బాబు  పల్లెటూరు కి చెందిన ఒక యువకుడిగా కనపడే అవకాశం ఉంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: