బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంత డేరింగ్ అండ్ డాషింగో తెలిసిన విషయమే. ‘మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమా విషయంలో ఆమె తెగువ అందరినీ విస్తుపోయేలా చేసింది. సగంలో ఆగిన మణికర్ణిక సినిమాకు దర్శకత్వం వహించి పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంది. ఇప్పుడు మరో భారీ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే.. కథ పరంగా చూస్తే చాలా వివాదాస్పద అంశాన్ని ఆమె ఎంచుకుందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల నుంచీ ఇండియాను కుదిపేసిన వివాదాస్పద అయోధ్య అంశంపై ఆమె సినిమా చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం.

IHG't Meant To Glorify <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KANGANA RANAUT' target='_blank' title='kangana ranaut-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kangana ranaut</a>, She Turned ...

 

ఈ కథ చేయాలనుందని గతంలోనే కంగానా చెప్పుకొచ్చింది. ఇప్పుడు అయోధ్యలో రామ్ మందిర నిర్మాణం, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ‘‘అపరాజిత అయోధ్య’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు నేనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమాలో నేను నటించడం లేదు. దర్శకత్వంపైనే పూర్తి దృష్టి పెట్టాలని భావిస్తున్నాను. ఈ సినిమాకు నిర్మాతను కూడా నేనే. ఇదంతా పెద్ద బాధ్యత కావడం వల్ల సినిమాలో నేను నటిచడం లేదు. కథ విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు” అని కంగనా చెప్పుకొచ్చింది.

IHG

 

దీనిపై ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘నిజానికి ఈ సినిమాకు దర్శకత్వం వహించాలనే ఆలోచన నాకు లేదు. సినిమా నిర్మాణంపై జరుగుతున్న చర్చల్లో భాగంగా నేను దర్శకత్వం వహిస్తే బాగుంటుందని ఓ చర్చ జరిగింది. అందుకు అంగీకరించాను. ఇదొక వివాదాస్పద కథగా నేను భావించటం లేదు. ప్రేమ, విశ్వాసం, ఐక్యత.. ఉన్న అంశంగా భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

IHG'Panga' trailer ...

 

మరింత సమాచారం తెలుసుకోండి: