గత కొన్ని రోజులుగా ప్రభాస్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని  అభిమానులు పదే పదే అడుగుతున్నారు. నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారంతా ప్రభాస్ నెక్స్ట్ చిత్రం గురించిన అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా తర్వాత రాధా క్రిష్ణ దర్శకత్వంలో స్టార్ట్ అయిన సినిమా గురించి ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ రాకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే.

 


సాహో సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్ మెంట్ తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ ఎలాంటి విషయం బయటకి రాలేదు. అలా అనేకంటే బయటకి వెల్లడి చేయలేదు అనడం కరెక్టేమో. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ సినిమా నుండి అప్డేట్ ఇవ్వాలని పెద్ద క్యాంపెయిన్ చేపట్టారు.

 


నిర్మాతలని తిడుతూ, నిర్మాణ సంస్థని బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేసారు. అయినా కూడా యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సినిమాపై అప్డేట్ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం అభిమానుల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని అంటున్నారు. లాక్డౌన్ టైమ్ లో ప్రామిస్ చేసినట్టుగా యూవీ క్రియేషన్ తన మాయ్ట నిలబెట్టుకునేలా కనిపిస్తుంది. యూరప్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా టైటిల్ మరికొద్ది రోజుల్లో రివీల్ చేయనుంది.

 

జూన్ 14వ తేదీన ప్రభాస్ సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రానప్పటికీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా ఉండనుందట. మరి ఈ సారైనా నిర్మాతలు అభిమానుల కోరిక నెరవేరుస్తారేమోఈ చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: