మలయాళంలో సూపర్ హిట్టైన క్రేజీ మూవీ అయ్యప్పనుమ్ కోషియం. సాచి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ కలిసి నటించారు. ఇద్దరు వ్యక్తుల ఈగోల మీద నడిచే ఈ సినిమా మలయాళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు వర్షన్ లో ఎవరు నటిస్తారు అన్నది మాత్రం  ఇంకా ఫైనల్ అవలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ తెరకెక్కనుందని తెలుస్తుంది. 

 

ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాలో రవితేజ,  రానా కలిసి నటిస్తారట. సూపర్ హిట్ రీమేక్  ఈ క్రేజీ కాంబో సెట్ చేసినట్టు తెలుస్తుంది. మాస్ మహారాజ్ రవితేజ బిజూ  పాత్రలో కనిపిస్తాడట.. ఇక పృథ్వి రాజ్ రోల్ లో రానా నటిస్తారని అంటున్నారు. మొదట్లో ఈ రీమేక్ బాలకృష్ణ, రానా కలిసి చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ బాలయ్యరీమేక్ పై ఇంట్రెస్ట్ చూపకపోవడంతో బాలయ్య బదులుగా రవితేజ ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నాడట. 

 

ఎలాగూ మలయాళంలో హిట్ అయ్యింది కాబట్టి తెలుగులో కూడా అదే రిజెల్ట్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ రీమేక్ డైరక్షన్ ఎవరు చేస్తారు.. ఇద్దరి హీరోలను హ్యాండిల్ చేయగలిగే సత్తా ఎవరికి ఉంది అన్నది తెలియాల్సి ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ను యువ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమా చేస్తుండగా.. రానా విరాటపర్వం సినిమాలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు తమ ప్రాజెక్టులను పూర్తి చేసుకుని రీమేక్ కోసం అవుతారట. మరి రవితేజ, రానా కలిసి చేసే ఈ సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.     

 

మరింత సమాచారం తెలుసుకోండి: